కోచీ నుంచి దోహా వరకు నాలుగు సర్వీసులను ప్రారంభించనున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్

- July 17, 2017 , by Maagulf
కోచీ నుంచి దోహా వరకు నాలుగు సర్వీసులను ప్రారంభించనున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్

వచ్చే నెల నుంచి తక్కువ ధర గల ప్రయాణికులను రవాణా చేసే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కొచ్చి నుంచి దోహా వరకు నాలుగు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. భారతీయ మీడియా కధనం ప్రకారం    మొదటి దశలో, దక్షణ భారతదేశం కేరళ లోని కోచి నుంచి దోహా వరకు నేరుగా మూడు విమానాలు ప్రారంభించబడనున్నాయని తెలిపింది. ఆగస్టు15 వ తేదీ నుంచి మరో విమానం, అదేవిధంగా మరో దానిని సెప్టెంబరు 15 న ప్రారంభించనున్నట్లు ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. భారతదేశం  నుంచి దోహా మధ్య వారంకు 14 విమానాలను నిర్వహిస్తోంచనుంది. కేరళ నుంచి 11 విమానాలను నిర్వహించనుంది. , వారానికి దేశం నుంచి  మొత్తం మీద వారానికి 18 విమానాలను కతర్ కు  తమ కార్యకలాపాలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. కతర్ కు  సంబంధించిన కార్యకలాపాలు, వచ్చే రెండు నెలల్లో దోహాకు నూతన విమానాలు ప్రవేశపెడుతున్నాయిని సీఈఓ కె శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఇప్పటికే కతర్ కు  అదనపు కార్యకలాపాలను విస్తరించింది.జూన్ 24 వ తేదీ దిగ్బంధం కారణంగా కతర్ దేశంకు ప్రయాణించేందుకు గిరాకీ పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com