పాదచారులకోసం 'గొడుగు'
- July 17, 2017
దుబాయ్: దుబాయ్ మునిసిపాలిటీ పాదచారుల కోసం గొడుగుల్ని అందించే సరికొత్త కార్యక్రమం చేపట్టింది. కార్పొరేట్ మార్కెటింగ్ అండ్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఖాలిద్ మొహమ్మద్ బద్రి మాట్లాడుతూ, మునిసిపాలిటీ వెయ్యికి పైగా గొడుగుల్ని తొలి రోజు పాదచారులకు అందజేసినట్లు తెలిపారు. ఎక్కువగా జనం ఉన్న ప్రాంతాల్లో ఈ గొడుగల పంపిణీ కార్యక్రమం చేపట్టామని చెప్పారాయన. ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని బద్రి చెప్పారు. వేసవి తాపం కారణంగా రోడ్లపై ఇబ్బంది పడ్తోన్న సామాన్యులకు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీతో ఈ గొడుగులను అందిస్తున్నామని వివరించారు బద్రి. మునిసిపాలిటీకి చెందిన పబ్లిక్ రిలేషన్స్ హెడ్ ఒమర్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, మహిళలు - పురుషులతో కూడిన టీమ్, ఈ గొడుగులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మెట్రో స్టేషన్లు, పార్క్లు తదితర ప్రాంతాల్లో గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గొడుగులతోపాటుగా హ్యాండ్ ఫ్యాన్లను పార్క్ల సందర్శకులకు అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







