ముగ్గురికి నచ్చని కథ హీరోవరుణ్ కు నచ్చింది
- July 18, 2017
వరుస ప్లాప్స్ తో ఇబ్బందులో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్.ప్రస్తుతం ఫిదా మూవీ ఫై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ తోనే తన జాతకం నిలిబడి ఉందని ఫిలిం సర్కిల్లో అంత మాట్లడుకుంటున్నారు. ఈ నెల 21 ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా కథ కు సంబదించిన ఓ న్యూస్ బయటకు వచ్చి మెగా అభిమానులను ఖంగారు పెడుతుంది. ఈ మూవీ కి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల మొదట ఈ కథ ను ముగ్గురు హీరోలకు వినిపించాడట.
అయితే ఏ ఒక్కరు కూడా ఈ కథ ఫై ఇంట్రస్ట్ చూపించలేదట. ఈ విషయాన్ని దిల్ రాజే పరోక్షంగా చెప్పాడు. ఈ సినిమా కథ చాన్నాళ్ల కిందటే తనకు శేఖర్ చెప్పాడని, స్టార్ హీరోతో రూపొందించాలని అనుకున్నామని అందుకే ముగ్గురు హీరోలకు ఈ సినిమా కథను వివరించామని రాజు చెప్పాడు. అయితే వారెవరితోనూ ఈ సినిమా పట్టాలెక్కలేదని.. వరుణ్ తేజ్ అయితే కరెక్ట్ అనిపించి ఈ హీరోతో ఈ కథను తెరకెక్కించామని రాజు చెప్పుకొచ్చాడు.
మరి వారికీ నచ్చని కథ మెగా హీరోకు నచ్చడం అనేది ఇప్పుడు మెగా అభిమానులను భయపెడుతుంది. మరి వరుణ్ కు అంతగా నచ్చిన ఈ కథ ప్రేక్షకులకు ఎలా నచ్చుతుంది అనేది చూడాలి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









