ముగ్గురికి నచ్చని కథ హీరోవరుణ్ కు నచ్చింది
- July 18, 2017
వరుస ప్లాప్స్ తో ఇబ్బందులో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్.ప్రస్తుతం ఫిదా మూవీ ఫై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ తోనే తన జాతకం నిలిబడి ఉందని ఫిలిం సర్కిల్లో అంత మాట్లడుకుంటున్నారు. ఈ నెల 21 ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా కథ కు సంబదించిన ఓ న్యూస్ బయటకు వచ్చి మెగా అభిమానులను ఖంగారు పెడుతుంది. ఈ మూవీ కి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల మొదట ఈ కథ ను ముగ్గురు హీరోలకు వినిపించాడట.
అయితే ఏ ఒక్కరు కూడా ఈ కథ ఫై ఇంట్రస్ట్ చూపించలేదట. ఈ విషయాన్ని దిల్ రాజే పరోక్షంగా చెప్పాడు. ఈ సినిమా కథ చాన్నాళ్ల కిందటే తనకు శేఖర్ చెప్పాడని, స్టార్ హీరోతో రూపొందించాలని అనుకున్నామని అందుకే ముగ్గురు హీరోలకు ఈ సినిమా కథను వివరించామని రాజు చెప్పాడు. అయితే వారెవరితోనూ ఈ సినిమా పట్టాలెక్కలేదని.. వరుణ్ తేజ్ అయితే కరెక్ట్ అనిపించి ఈ హీరోతో ఈ కథను తెరకెక్కించామని రాజు చెప్పుకొచ్చాడు.
మరి వారికీ నచ్చని కథ మెగా హీరోకు నచ్చడం అనేది ఇప్పుడు మెగా అభిమానులను భయపెడుతుంది. మరి వరుణ్ కు అంతగా నచ్చిన ఈ కథ ప్రేక్షకులకు ఎలా నచ్చుతుంది అనేది చూడాలి.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







