జిఎస్టీ అమలుతో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి
- July 18, 2017
ఆ నెల 1నుంచి అమల్లోకి వచ్చిన జిఎస్టీ ని అమలు చేసే విషయంల తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని సిఎం కెసిఆర్ అన్నారు.. మొదటి పక్షం రోజుల్లోనే 90శాతం నుంచి వాట్ ఖాతాదాలరును జిఎస్టీ పరదిలోకి తీసుకురాగలిగామని అన్నారు.. 1.92 లక్షల మందిట్రేడర్లు, ఈనెల 15 వరకు జిఎస్టీలో అనుసంధానమై నెంబర్లు పొందారని అన్నారు.. ట్రేడర్లందరినీ అధికారులు వ్యక్తిగతంగా కలిసి జిఎస్టీ పరిధిలోకి తెచ్చారని, 15 రోజులో ఇంతటి పురోగతి సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు.. జిఎస్టీపై చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు, గందరగోళం కొనసాగుతున్నా నేపథ్యంలో తెలంగాణ ఇంత విజయం సాధించటం గొప్ప విషయమని కేంద్రం కితాబిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
జిఎస్టీలో ఇంత తక్కువ సమయంలో విజయం సాధించినందుకు అధికారులను సిఎం అభినందించారు.. ఈనెలాఖరులోఆ వందశాతం రిజిస్ట్రేషన్లు పూర్తికావాలని ఆయన ఆదేశించారు.. అలాగే వస్త్ర, గ్రానైట్, బిడి పరిశ్రమలపై జిఎస్టీ విషయంలో రాయితీలు, మినహాయింపులు కోరామని, దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిఎస్టీ కౌన్సిల్లో ఇప్పటికే ఈ విషయానిన లేవనెత్తామిన, తానుకూడ స్వయంగా ప్రధానికి లేఖ రాసినట్టు కెసిఆర్ వివరించారు.. ఆయా రంగాలపై ఆధారపడే తెలంగాణలో సంగం మంది బతుకుతున్నారని, జిఎస్టీతో వీరికి ప్రతికూలత ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్









