జిఎస్టీ అమలుతో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి
- July 18, 2017
ఆ నెల 1నుంచి అమల్లోకి వచ్చిన జిఎస్టీ ని అమలు చేసే విషయంల తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని సిఎం కెసిఆర్ అన్నారు.. మొదటి పక్షం రోజుల్లోనే 90శాతం నుంచి వాట్ ఖాతాదాలరును జిఎస్టీ పరదిలోకి తీసుకురాగలిగామని అన్నారు.. 1.92 లక్షల మందిట్రేడర్లు, ఈనెల 15 వరకు జిఎస్టీలో అనుసంధానమై నెంబర్లు పొందారని అన్నారు.. ట్రేడర్లందరినీ అధికారులు వ్యక్తిగతంగా కలిసి జిఎస్టీ పరిధిలోకి తెచ్చారని, 15 రోజులో ఇంతటి పురోగతి సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు.. జిఎస్టీపై చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు, గందరగోళం కొనసాగుతున్నా నేపథ్యంలో తెలంగాణ ఇంత విజయం సాధించటం గొప్ప విషయమని కేంద్రం కితాబిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
జిఎస్టీలో ఇంత తక్కువ సమయంలో విజయం సాధించినందుకు అధికారులను సిఎం అభినందించారు.. ఈనెలాఖరులోఆ వందశాతం రిజిస్ట్రేషన్లు పూర్తికావాలని ఆయన ఆదేశించారు.. అలాగే వస్త్ర, గ్రానైట్, బిడి పరిశ్రమలపై జిఎస్టీ విషయంలో రాయితీలు, మినహాయింపులు కోరామని, దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిఎస్టీ కౌన్సిల్లో ఇప్పటికే ఈ విషయానిన లేవనెత్తామిన, తానుకూడ స్వయంగా ప్రధానికి లేఖ రాసినట్టు కెసిఆర్ వివరించారు.. ఆయా రంగాలపై ఆధారపడే తెలంగాణలో సంగం మంది బతుకుతున్నారని, జిఎస్టీతో వీరికి ప్రతికూలత ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







