అత్యంత వేగవంతమైన హరమైన్ రైలు మొదటి సారిగా జెడ్డాలో ప్రవేశం

- July 20, 2017 , by Maagulf
అత్యంత వేగవంతమైన హరమైన్  రైలు మొదటి సారిగా జెడ్డాలో ప్రవేశం

రైలు వ్యవస్థలో నిర్వహించిన పరీక్షల అనంతరం అత్యంత వేగవంతమైన హరమైన్  రైలు మొదటిసారిగా జెడ్డా రైల్వేస్టేషన్ కు వచ్చింది. రైలు కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ (కెఎఇసి) నుంచి పైలట్ ట్రిప్ గా జెడ్డా  చేరుకుంది. "రైల్వే కార్పొరేషన్ హరమైన్ రైలు ప్రాజెక్ట్ ద్వారా యాత్రికులు మరియు అతిధులకు తన సేవలను అందించడానికి తన శక్తిని ఉపయోగించి విజన్ 2030 ను గ్రహించడంలో ప్రధాన  పాత్రను పోషిస్తుంది, దీని ప్రయాణం  మక్కా మరియు మదీనాను జెడ్డా, కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ (కెఎఇసి) ద్వారా రబీగ్ లో కలిపనున్నట్లని సౌదీ రైల్వేస్ ఆర్గనైజేషన్ (ఎస్.ఆర్.ఒ)  పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (పి.టి.టి) చైర్మన్ రమాయ్హ్ బిన్ మహ్మద్ అల్-రూమియా) పేర్కొన్నారు.  2017 చివరినాటికి రైల్వే పూర్తిస్థాయి కార్యకలాపాలు సాగిస్తుందని చెప్పారు. చివరి డిసెంబర్, హరమైన్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాసమ్ బిన్ అహ్మద్ ఘుల్మన్ మధ్యప్రాచ్యంలో అతిపెద్ద రవాణా ప్రణాళిక మరియు ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజా రవాణా ప్రాజెక్టుల్లో ఒకటి.ఇది 62 బిలియన్ సౌదీ రియాళ్లను ( 16.5 బిలియన్ డాలర్ల )  అంచనా వ్యయం వేయబడింది మరియు 15,000 విద్యుత్  పైలాన్లు మరియు కొన్ని పర్వతాలను కూల్చివేయాల్సిఉంది. 450 కిలోమీటర్ల పొడవు గల విద్యుత్ రైల్వే సేవల ద్వారా 35 రైళ్ళ ద్వారా సంవత్సరానికి 60 మిలియన్ల మంది ప్రయాణీకులను తమ గమ్యాలకు చేర్చనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com