హిమాచల్‌ ప్రదేశ్‌ లోయలో పడిన బస్సు, 28 మంది మృతి

- July 20, 2017 , by Maagulf
హిమాచల్‌ ప్రదేశ్‌ లోయలో పడిన బస్సు, 28 మంది మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చేరువలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సోలన్‌ నుంచి కిన్నూర్‌కు 40 మంది ప్రయాణీకులతో ఓ బస్సు బయల్దేరింది.
బస్సు రామ్‌పూర్‌ వద్ద కొండలపై ఉన్న ఘాట్‌లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న సట్లెజ్‌ నది పరివాహక ప్రాంత లోయలో పడిపోయింది. ఎత్తు నుంచి బస్సు దొర్లుతూ పడటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ తొమ్మిది మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com