సౌఖ్ వక్కిఫ్ ' ఖర్జూర పండుగ ' జులై 27 వ తేదీ నుంచి ప్రారంభం
- July 20, 2017
ఈ నెల జూలై 27 వ తేదీ నుంచి సౌక్ వాకిఫ్ వద్ద తాజా ఖర్జూర పండుగ ప్రారంభం కానుందని మునిసిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఇది సందర్శకులకు చౌక ధరలతో ఖర్జూరాలు లభ్యం కావడమే కాక ఖర్జూరాలను ప్రదర్శిస్తారు. స్థానికంగా 57 ఖర్జూర పొలాలు ఈ ఉత్సవంలో పాల్గొననున్నాయి. ఖర్జూరాలలో వివిధ ఉత్తమ రకాలైన ఖలాస్, ఖానిజీ, బారు మరియు షిషి వంటి రకాలు అందుబాటులో ఉంటాయి. దేశం ప్రస్తుత ఆర్థిక దిగ్బందంలో ఉండగా ఈ పండుగ నిర్వహించబడుతోంది. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ,మద్దతు తెలిపేందుకు దోహదపడనుంది. ' ఖర్జూర పండుగ ' నిర్వహణ ద్వారా ఆహార భద్రతను సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రిత్వశాఖ వ్యవసాయ సంబంధ అఫిరైస్ విభాగం సౌఖ్ వఖీఫ్ మేనేజ్మెంట్ సహకారంతో ఈ పండుగను నిర్వహిస్తోంది. ఖర్జూరాలు రాయితీ ధరల వద్ద కూడా అందుబాటులో ఉంటుంది.గత ఏడాది మొత్తం ఖర్జూరాలు ఉత్పత్తి 28,877 టన్నులు కాగా 81 శాతం స్థానిక డిమాండ్ ను సాధించగలిగింది. మిగిలినవి ఒమన్ మరియు ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యాయి. దేశంలో 1,307 రిజిస్ట్రేషన్ పొలాలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 902 ఉత్పాదక ఖర్జూరాలు ఉన్నాయిని మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









