న్యూ ఢిల్లీలోని కాన్సులర్‌ సర్వీసెస్‌ వీసా సెంటర్‌ని సందర్శించిన యూఏఈ రాయబారి

- July 20, 2017 , by Maagulf
న్యూ ఢిల్లీలోని కాన్సులర్‌ సర్వీసెస్‌ వీసా సెంటర్‌ని సందర్శించిన యూఏఈ రాయబారి

భారతదేశంలో యూఏఈ రాయబారి అయిన డాక్టర్‌ అహ్మద్‌ అల్‌ బన్నా, న్యూ ఢిల్లీలోగల కాన్సులర్‌ సర్వీసెస్‌ అండ్‌ వీసా సెంటర్‌ని సందర్శించారు. ఈ అధికారిక పర్యటనలో కొన్ని సూచనల్ని కూడా ఆయన చేయడం జరిగింది. కాన్సులర్‌ సెక్షన్‌లో డిప్లమాట్స్‌తో అంబాసిడర్‌ చర్చలు జరిపారు. 2017 తొలి ఆరు నెలల్లో మొత్తం 27,337 వీసాలు గ్రాంట్‌ కాగా, 98,837 డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ జరిగింది. ఈ రిపోర్ట్‌పై ఆయన రివ్యూ చేశారు. వీసా ప్రాసెసింగ్‌, వెరిఫికేషన్‌ని మరింత సులభతరం చేసే దిశగా ఇన్నోవేటివ్‌గా ఆలోచన చేయాలనీ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు అల్‌ బన్నా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com