గల్ఫ్ కార్మికుల వివరాలు సేకరిస్తున్నాం:దత్తాత్రేయ
- July 21, 2017
ఢిల్లీ: కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాద్రేయ శుక్రవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో భేటీ అయ్యారు. గల్ఫ్ దేశాల్లో భారత కార్మికుల రక్షణకు సంబంధించిన పలు కీలక విషయాలను ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారత కార్మికుల వివరాలు సేకరిస్తున్నామని సుష్మాకు దత్తాత్రేయ తెలిపారు.
ఏజెంట్ల మోసాలతో టూరిస్టు వీసాలపై వెళ్ళి చాలా మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని సుష్మా దృష్టికి తీసుకెళ్లినట్లు భేటీ అనంతరం మంత్రి దత్తాత్రేయ మీడియాకు తెలిపారు. మోసం చేసే సంస్థలు, ఏజెంట్లపైనా దర్యాప్తు చేపట్టడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సుష్మా హామీ ఇచ్చారని దత్తాత్రేయ వివరించారు. హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయ ఆధునీకరణపై సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









