పోలీసులకు గుండెళ్ళో రైళ్లు పరుగెత్తించిన సోషల్ మీడియాలో బాలుని ఫోటో పోస్ట్
- July 21, 2017
ఏదైనా పాత ఫోటో దొరికితే చాలు...వెంటనే వాటికి కల్పిత గాధలను జోడించి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం అవి సంచలనం కల్గించగానే...అదో పెద్ద విజయం సాధించినట్లు తెగ ఆనందపడే ప్రబుద్ధులు ఇటీవల అధికమయ్యారు. అటువంటి ప్రయోగానికి ఈసారి రాయల్ ఒమాన్ పోలీసులు బలయ్యారు. పోలీసు స్టేషన్లో గత 40 రోజులుగా ఉంటున్న ఒ చిన్న పిల్లవాడు ఉబికి వస్తున్న కన్నీళ్ల తో దీనంగా పోలీసుల ఎదుట నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియా లో ఇటీవల చక్కర్లు కొడుతోంది.ఆ పుకారుకు మాకు ఎటువంటి సంబంధం లేదని...ఆ పిల్లవాడు తమ ఆధీనంలో లేనే లేదని రాయల్ ఒమన్ పోలీసులు లబోదిబోమంటూ గగ్గోలు పెడుతున్నారు.వాస్తవానికి, ఈ ఫోటో పాకిస్తాన్ ప్రాంతంలో తప్పిపోయిన ఏడు ఏళ్ల బాలుడి దని 2016 లో పాకిస్తానీ వార్తాపత్రికలో ఆ వార్తను సైతం ప్రచురించారని పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత ఆ బాలుడిని భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో కనుగొన్నారు. పాకిస్తానీ వార్తాపత్రిక కధనం ప్రకారం, కనిపించకుండా పోయినపుడు ఫోటోలో బాలుని వయస్సు ఐదు సంవత్సరాలు మాత్రమేనని తెలిపింది. తర్వాత ఏడు సంవత్సరాల వయస్సులో బాలుని ఆచూకీ దొరికింది.. పాకిస్థానీ లో ఆ బాలుని తల్లితండ్రులు ఇరు ప్రాంతాల మధ్య గృహాబదిలీ చేస్తున్నసమయంలో జూన్ 6 వ తేదీన 2014 లో ఆ బాలుడు తన కుటుంబం నుండి తప్పిపోయాడు. ఇపుడు ఎనిమిదేళ్ల వయస్సులో ఆ బుడతడు సోషల్ మీడియా పుణ్యామాని వెలుగులోనికి వచ్చి రాయల్ ఒమన్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







