పోలీసులకు గుండెళ్ళో రైళ్లు పరుగెత్తించిన సోషల్ మీడియాలో బాలుని ఫోటో పోస్ట్
- July 21, 2017
ఏదైనా పాత ఫోటో దొరికితే చాలు...వెంటనే వాటికి కల్పిత గాధలను జోడించి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం అవి సంచలనం కల్గించగానే...అదో పెద్ద విజయం సాధించినట్లు తెగ ఆనందపడే ప్రబుద్ధులు ఇటీవల అధికమయ్యారు. అటువంటి ప్రయోగానికి ఈసారి రాయల్ ఒమాన్ పోలీసులు బలయ్యారు. పోలీసు స్టేషన్లో గత 40 రోజులుగా ఉంటున్న ఒ చిన్న పిల్లవాడు ఉబికి వస్తున్న కన్నీళ్ల తో దీనంగా పోలీసుల ఎదుట నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియా లో ఇటీవల చక్కర్లు కొడుతోంది.ఆ పుకారుకు మాకు ఎటువంటి సంబంధం లేదని...ఆ పిల్లవాడు తమ ఆధీనంలో లేనే లేదని రాయల్ ఒమన్ పోలీసులు లబోదిబోమంటూ గగ్గోలు పెడుతున్నారు.వాస్తవానికి, ఈ ఫోటో పాకిస్తాన్ ప్రాంతంలో తప్పిపోయిన ఏడు ఏళ్ల బాలుడి దని 2016 లో పాకిస్తానీ వార్తాపత్రికలో ఆ వార్తను సైతం ప్రచురించారని పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత ఆ బాలుడిని భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో కనుగొన్నారు. పాకిస్తానీ వార్తాపత్రిక కధనం ప్రకారం, కనిపించకుండా పోయినపుడు ఫోటోలో బాలుని వయస్సు ఐదు సంవత్సరాలు మాత్రమేనని తెలిపింది. తర్వాత ఏడు సంవత్సరాల వయస్సులో బాలుని ఆచూకీ దొరికింది.. పాకిస్థానీ లో ఆ బాలుని తల్లితండ్రులు ఇరు ప్రాంతాల మధ్య గృహాబదిలీ చేస్తున్నసమయంలో జూన్ 6 వ తేదీన 2014 లో ఆ బాలుడు తన కుటుంబం నుండి తప్పిపోయాడు. ఇపుడు ఎనిమిదేళ్ల వయస్సులో ఆ బుడతడు సోషల్ మీడియా పుణ్యామాని వెలుగులోనికి వచ్చి రాయల్ ఒమన్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









