రీమేక్ మీద మనసుపడ్డ జూనియర్ ఎన్టీఆర్
- July 22, 2017
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తరువాత చేయబోయే సినిమాను ఇంత వరకు ప్రకటించలేదు. సినిమాతో పాటు తొలిసారిగా బుల్లితెర ఎంట్రీ ఇస్తూ బిగ్ బాస్ షో కూడా చేస్తున్నాడు జూనియర్. ఈ రెండు ప్రాజెక్ట్ ల తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటీ అన్న చర్చ మొదలైంది. స్టార్ డైరెక్టర్లు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నారు. జూనియర్ మాత్రం ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ ను కన్ఫామ్ చేయలేదు.
రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన రాజ కుమార సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ఎన్టీఆర్. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాండల్ వుడ్ లో ఘనవిజయం సాధించింది.
ఎన్టీఆర్ స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన రాజ కుమార అక్కడ అత్యథిక సెంటర్లలో శతదినోత్సవం జరుపుకున్న సినిమాగా రికార్డ్ సృష్టించింది. పునీత్ స్వయంగా రాజ కుమార రీమేక్ గురించి ఎన్టీఆర్ తో చర్చించాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. రాజ కుమార రీమేక్ పై ఎన్టీఆర్ గట్టిగానే ఆలోచిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







