తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- July 23, 2017


దోహా,ఖతార్ : తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉచిత వైద్య శిబిరం తేదీ 21-07-2017 రోజున అల్ సుల్తాన్ మెడికల్ సెంటర్ లో ఐసీసీ, మరియు ఐసీబీఎఫ్ వారి సహకారంతో నిర్వహించబడినది.
గల్ఫ్ దేశాలలో ఉండే వేసవి కాలం ఎండ వేడిమి, పని ఒత్తిడి, మరియు ఇతర సమస్యల వల్ల బాధపడే వారు మరియు ముందస్తు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకోదలచిన అనేక మంది తెలంగాణ ప్రవాస కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. మరియు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని వైద్య పరీక్షలు చేపించుకోడానికి వచ్చిన తెలంగాణ ప్రవాస కార్మమికులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ICC అధ్యక్షురాలు శ్రీమతి మిలన్ అరుణ్ గారు, సభ్యత్వ కార్యదర్శి శ్రీ ప్రసాద్ కోడూరి, ICBF అధ్యక్షుడు శ్రీ డేవిస్ ఎడుకులతుర్ గారు , కార్యదర్శి శ్రీ మహేష్ గౌడ గారు ముఖ్య అతిధులుగా పాల్గొని తెలంగాణ ప్రజా సమితి ఖతార్ కార్యవర్గం తెలంగాణా కార్మికులకు చేస్తున్న నిర్విరామ సేవలను కొనియాడారు.ఈ సంధర్భంగా కార్మికులకు రక్త, షుగర్ మరియు వివిధ వైద్య విపుణులతో ఉచిత పరీ్క్షలు నిర్వహించారు.
అల్ సుల్తాన్ మెడికల్ సెంటర్ జనరల్ మేనేజర్ శ్రీ అక్రమ్ గారు మాట్లాడుతూ కార్మికుల ఆర్ధిక పరిస్తితులకు అనుగుణంగా తక్కువ ధరలకే నాణ్యమైన వైద్యం అందించుటకు తమ వంతుగా మెంబర్షిప్ కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు.దీంతో కార్మికులు 30 రియాల్ లకే కన్సల్టేషన్ మరియు మందుల పై 15% డిస్కౌంట్ పొందగలరని తెలిపారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం ద్యేయంగా పని చేస్తున్న తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఇక ముందు మరెన్నో సేవ, సాంస్కృతిక కారక్రమాలు చేపడుతుంది అని కార్యవర్గం పేర్కొంది.
--(రాజ్ కుమార్ వనంబత్తిన,మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)





తాజా వార్తలు
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!









