5 రూపాయలకే లీటర్ మంచినీళ్లు

- July 23, 2017 , by Maagulf
5 రూపాయలకే లీటర్ మంచినీళ్లు

2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 450 రైల్వేస్టేషన్లలో 1,100 వాటర్‌ వెండింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయాలని ది ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) లక్ష్యంగా పెట్టుకొంది. ప్రయాణికులకు తక్కువ ధరకు సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేయనుంది. 300 మి.లీ. నీటిని రూ.1 అందించాలని యోచిస్తోంది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వశాఖ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. తక్కువ ధరకు సురక్షిత మంచినీటిని అందించడమే కాకుండా దీని ద్వారా సుమారు 2వేల మందికి ఉపాధిని కూడా కల్పించనుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 345 రైల్వే స్టేషన్లలో 1,106 వాటర్‌ వెండింగ్‌ మెషీన్లు ఉన్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. 2015లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా అందుబాటు ధరకు ప్రయాణికులకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. ఆర్‌వో మెషీన్ల ద్వారా మంచినీటిని అందించనున్నారు. ఇవి 24గంటలూ పనిచేయనున్నాయి. అరలీటర్‌ రూ.3కు, లీటర్‌ రూ.5, రెండు లీటర్లు రూ.8, ఎనిమిది లీటర్ల క్యాన్‌ రూ.20లకు అందించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com