ఘనంగా వైఎస్సార్ జయంతి స్కాట్లాండ్లో
- July 23, 2017
దివంగత మహానేత వైఎస్సార్ జయంతిని స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఘనంగా నిర్వహించారు. యూకే–యూరప్ వైఎస్సార్సీపీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పార్టీ తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి అమృతసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జన సంక్షేమానికి పాటుపడిన వైఎస్సార్ నేటికీ నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఆయన దక్షిణ భారత దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్మయుద్ధం చేస్తున్నారన్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మద్దతు పలికి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర విభాగం నాయకులు కేసరి సాగర్, యూకే–యూరప్ వింగ్ నాయకులు డాక్టర్ ప్రదీప్రెడ్డి, శివ, వాసుదేవరెడ్డి, ఓబుల్రెడ్డి, జయంతి, అనిల్ బెంజిన్, గోపాల్, గీత పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









