ఘనంగా వైఎస్సార్ జయంతి స్కాట్లాండ్లో
- July 23, 2017
దివంగత మహానేత వైఎస్సార్ జయంతిని స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఘనంగా నిర్వహించారు. యూకే–యూరప్ వైఎస్సార్సీపీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పార్టీ తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి అమృతసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జన సంక్షేమానికి పాటుపడిన వైఎస్సార్ నేటికీ నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఆయన దక్షిణ భారత దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్మయుద్ధం చేస్తున్నారన్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మద్దతు పలికి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర విభాగం నాయకులు కేసరి సాగర్, యూకే–యూరప్ వింగ్ నాయకులు డాక్టర్ ప్రదీప్రెడ్డి, శివ, వాసుదేవరెడ్డి, ఓబుల్రెడ్డి, జయంతి, అనిల్ బెంజిన్, గోపాల్, గీత పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







