ఘనంగా వైఎస్సార్ జయంతి స్కాట్లాండ్లో
- July 23, 2017
దివంగత మహానేత వైఎస్సార్ జయంతిని స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఘనంగా నిర్వహించారు. యూకే–యూరప్ వైఎస్సార్సీపీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పార్టీ తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి అమృతసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జన సంక్షేమానికి పాటుపడిన వైఎస్సార్ నేటికీ నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఆయన దక్షిణ భారత దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్మయుద్ధం చేస్తున్నారన్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మద్దతు పలికి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర విభాగం నాయకులు కేసరి సాగర్, యూకే–యూరప్ వింగ్ నాయకులు డాక్టర్ ప్రదీప్రెడ్డి, శివ, వాసుదేవరెడ్డి, ఓబుల్రెడ్డి, జయంతి, అనిల్ బెంజిన్, గోపాల్, గీత పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









