పాస్పోర్ట్ దరఖాస్తుకి జనన ద్రువీ కరణ పత్రం తో పనిలేదు
- July 23, 2017
ఇకపై భారతీయులు పాస్పోర్ట్ పొందడం మరింత సులువు. బర్త్ సర్టిఫికెట్ స్థానంలో ఆధార్ లేదా పాన్కార్డ్లను పరిగణలలోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. పాత నిబంధనల ప్రకారం జనవరి 26, 1989 తర్వాత పుట్టిన వారు పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునే సమయంలో విధిగా బర్త్ సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణయం ప్రకారం స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, ఆధార్, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఎల్ఐసీ బాండ్లలో ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుందని కేంద్రమంత్రి వీకే సింగ్ పార్లమెంటుకు తెలిపారు. అలాగే 60 ఏళ్లు పైబడిన పెద్దవారికి, 8 ఏళ్ల లోపు చిన్నారులకు పాస్పోర్టు ఫీజులో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలియజేసింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









