పాస్పోర్ట్ దరఖాస్తుకి జనన ద్రువీ కరణ పత్రం తో పనిలేదు
- July 23, 2017
ఇకపై భారతీయులు పాస్పోర్ట్ పొందడం మరింత సులువు. బర్త్ సర్టిఫికెట్ స్థానంలో ఆధార్ లేదా పాన్కార్డ్లను పరిగణలలోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. పాత నిబంధనల ప్రకారం జనవరి 26, 1989 తర్వాత పుట్టిన వారు పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునే సమయంలో విధిగా బర్త్ సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణయం ప్రకారం స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, ఆధార్, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఎల్ఐసీ బాండ్లలో ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుందని కేంద్రమంత్రి వీకే సింగ్ పార్లమెంటుకు తెలిపారు. అలాగే 60 ఏళ్లు పైబడిన పెద్దవారికి, 8 ఏళ్ల లోపు చిన్నారులకు పాస్పోర్టు ఫీజులో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలియజేసింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







