అబుదాబిలో ఇరుకైన గదుల్లో ఉన్నందుకు ఒకే రోజు 40 మంది తెలుగు వారికి జరిమానా
- July 24, 2017
అబుదాబిలో ఇరుకు గదుల్లో ఎక్కువ మంది నివసిస్తే, ఆయా ప్రాంతాలపై అక్కడి ప్రభుత్వం దాడులు చేస్తోంది. ఎమిరేట్స్ నివాస నిబంధనలు ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. తెలుగువారు నివసిస్తున్న గృహాలపై దాడులు చేసిన అధికారులు ఒకే రోజు 40 మందికి జరిమానాలు విధించడం వారిలో గుబులు రేపుతోంది. ఉపాధి నిమిత్తం వెళ్తున్న తెలుగువారు వేతనాలు తక్కువగా ఉండటంతో 10 నుంచి 20 మంది ఒకే గదిలో ఉంటున్నారు. చాలా కాలంగా అక్కడ ఈ వ్యవహారం సాగుతుండగా, అబుదాబి ప్రభుత్వం ఇప్పుడు కొరడా ఝలిపిస్తోంది. ఎమిరేట్స్ రెసిడెన్షియల్ నియమా వళి-2011 చట్టం సంఖ్య-1లో పేర్కొన్నట్లుగా అబుదాబి మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నవారు ఇకపై ఒక గదిలో ముగ్గురికన్నా మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. అపార్ట్మెంట్ లేదా విల్లాలో ఒక కుటుంబం మాత్రమే ఉండాలని, బ్రహ్మచారులైతే ఒక బెడ్ రూమ్లో ముగ్గురు వ్యక్తులే ఉండాలని, వంట గది, కారిడార్, సాధారణ ప్రాంతాల్లో నిద్ర పోవడానికి ఉపయోగించవద్దంటూ ఆదేశాలు వచ్చాయి.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









