కొత్త రాష్ట్రపతికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
- July 25, 2017
దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం సందర్భంగా కోవింద్ చేసిన ప్రసంగం ఆకట్టుకుందంటూ ట్వీట్ చేశారు. దేశ బలాలను, ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని వర్ణిస్తూ ఆయన చేసిన ప్రసంగం స్ఫూర్తిమంతంగా ఉందంటూ కొనియాడారు.
భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.ఎస్. ఖేహర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









