కొత్త రాష్ట్రపతికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
- July 25, 2017
దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం సందర్భంగా కోవింద్ చేసిన ప్రసంగం ఆకట్టుకుందంటూ ట్వీట్ చేశారు. దేశ బలాలను, ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని వర్ణిస్తూ ఆయన చేసిన ప్రసంగం స్ఫూర్తిమంతంగా ఉందంటూ కొనియాడారు.
భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.ఎస్. ఖేహర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









