కొత్త రాష్ట్రపతికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
- July 25, 2017
దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం సందర్భంగా కోవింద్ చేసిన ప్రసంగం ఆకట్టుకుందంటూ ట్వీట్ చేశారు. దేశ బలాలను, ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని వర్ణిస్తూ ఆయన చేసిన ప్రసంగం స్ఫూర్తిమంతంగా ఉందంటూ కొనియాడారు.
భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.ఎస్. ఖేహర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







