ఆగస్టులో వస్తోన్న సునీల్ 'ఉంగరాల రాంబాబు'
- July 25, 2017
సునీల్ హీరోగా నటించిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. క్రాంతి మాధవ్ దర్శకుడు. మియాజార్జ్ కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు వారాల్లో సెన్సారు కార్యక్రమాలు జరుపుకోవడానికి సిద్ధమౌతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా 'ఉంగరాల రాంబాబు' ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా అందరి అంచనాలు అందుకుని, ఘన విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ప్రకాశ్రాజ్, పోసాని, వెన్నెల కిశోర్, అలీ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి' అన్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







