ఆఫ్ఘాన్‌లోని కాందహార్‌లోని ఖరేజ్‌ జిల్లా ఖర్జాలి ప్రాంతంలో ఉగ్ర దాడి: 26 మంది మృతి

- July 26, 2017 , by Maagulf
ఆఫ్ఘాన్‌లోని  కాందహార్‌లోని ఖరేజ్‌ జిల్లా ఖర్జాలి ప్రాంతంలో ఉగ్ర దాడి: 26 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ఘాతుకానికి పాల్పడ్డారు. కాందహార్‌ ప్రావిన్స్‌లోని సైనిక స్థావరంపై దాడి చేసి 26 మంది సైనికుల ప్రాణాలను బలిగొన్నారు. ఈ కాల్పుల్లో మరో 13 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. కాందహార్‌లోని ఖరేజ్‌ జిల్లా ఖర్జాలి ప్రాంతంలోని సైనిక స్థావరంపై తాలిబన్లు గత రాత్రి దాడి చేసినట్లు ఎంవోడీ ప్రతినిధి జనరల్‌ దవాలత్‌ వజిరి తెలిపారు. తాలిబన్ల దాడిని సైనిక దళాలు తీవ్రంగా ప్రతిఘటించాయని ఆయన పేర్కొన్నారు. సైనిక దళాల దాడిలో దాదాపు 80 మందికి పైగా తిరుగుబాటుదారులు హతమైనట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com