ఆఫ్ఘాన్లోని కాందహార్లోని ఖరేజ్ జిల్లా ఖర్జాలి ప్రాంతంలో ఉగ్ర దాడి: 26 మంది మృతి
- July 26, 2017
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ఘాతుకానికి పాల్పడ్డారు. కాందహార్ ప్రావిన్స్లోని సైనిక స్థావరంపై దాడి చేసి 26 మంది సైనికుల ప్రాణాలను బలిగొన్నారు. ఈ కాల్పుల్లో మరో 13 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. కాందహార్లోని ఖరేజ్ జిల్లా ఖర్జాలి ప్రాంతంలోని సైనిక స్థావరంపై తాలిబన్లు గత రాత్రి దాడి చేసినట్లు ఎంవోడీ ప్రతినిధి జనరల్ దవాలత్ వజిరి తెలిపారు. తాలిబన్ల దాడిని సైనిక దళాలు తీవ్రంగా ప్రతిఘటించాయని ఆయన పేర్కొన్నారు. సైనిక దళాల దాడిలో దాదాపు 80 మందికి పైగా తిరుగుబాటుదారులు హతమైనట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









