ఆఫ్ఘాన్లోని కాందహార్లోని ఖరేజ్ జిల్లా ఖర్జాలి ప్రాంతంలో ఉగ్ర దాడి: 26 మంది మృతి
- July 26, 2017
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ఘాతుకానికి పాల్పడ్డారు. కాందహార్ ప్రావిన్స్లోని సైనిక స్థావరంపై దాడి చేసి 26 మంది సైనికుల ప్రాణాలను బలిగొన్నారు. ఈ కాల్పుల్లో మరో 13 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. కాందహార్లోని ఖరేజ్ జిల్లా ఖర్జాలి ప్రాంతంలోని సైనిక స్థావరంపై తాలిబన్లు గత రాత్రి దాడి చేసినట్లు ఎంవోడీ ప్రతినిధి జనరల్ దవాలత్ వజిరి తెలిపారు. తాలిబన్ల దాడిని సైనిక దళాలు తీవ్రంగా ప్రతిఘటించాయని ఆయన పేర్కొన్నారు. సైనిక దళాల దాడిలో దాదాపు 80 మందికి పైగా తిరుగుబాటుదారులు హతమైనట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









