ఆఫ్ఘాన్లోని కాందహార్లోని ఖరేజ్ జిల్లా ఖర్జాలి ప్రాంతంలో ఉగ్ర దాడి: 26 మంది మృతి
- July 26, 2017
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ఘాతుకానికి పాల్పడ్డారు. కాందహార్ ప్రావిన్స్లోని సైనిక స్థావరంపై దాడి చేసి 26 మంది సైనికుల ప్రాణాలను బలిగొన్నారు. ఈ కాల్పుల్లో మరో 13 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. కాందహార్లోని ఖరేజ్ జిల్లా ఖర్జాలి ప్రాంతంలోని సైనిక స్థావరంపై తాలిబన్లు గత రాత్రి దాడి చేసినట్లు ఎంవోడీ ప్రతినిధి జనరల్ దవాలత్ వజిరి తెలిపారు. తాలిబన్ల దాడిని సైనిక దళాలు తీవ్రంగా ప్రతిఘటించాయని ఆయన పేర్కొన్నారు. సైనిక దళాల దాడిలో దాదాపు 80 మందికి పైగా తిరుగుబాటుదారులు హతమైనట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







