ఆ 39 మంది చనిపోయినట్లు ఆధారాలు లేవు సుష్మాస్వరాజ్ వివరణ

- July 26, 2017 , by Maagulf
ఆ 39 మంది చనిపోయినట్లు ఆధారాలు లేవు సుష్మాస్వరాజ్ వివరణ

ఇరాక్‌లోని మోసుల్‌లో అదృశ్యమైన 39 మంది భారతీయులు చనిపోయినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ బుధవారం లోక్‌సభలో తెలియజేశారు. అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలు చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. ‘నా మాటలు అబద్ధం అయితే అదృశ్యమైన 39 మంది భారతీయుల కుటుంబాలను కలవండి, వాళ్లే చెబుతారు. ఇరాక్‌ కూడా వారంతా చనిపోయినట్లు చెప్పలేదు. దీని గురించి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. వారి గురించి ఎటువంటి సమాచారం లేకుండా నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను’.. అని ఆమె అన్నారు.
అదృశ్యమైన భారతీయుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి లోక్‌సభలో చెప్పారు. మోసుల్‌ ప్రాంతంలో పనిచేసుకుంటున్న భారత్‌కు చెందిన 39 మంది కార్మికులను ఐసిస్‌ ఉగ్రవాదులు 2014లో బందీలుగా చేసుకున్నారు. ఇటీవల ఇరాక్‌ భద్రతా బలగాలు మోసుల్‌ను ఐసిస్‌ చెర నుంచి విడిపించారు. దాంతో వారి వద్ద బందీలుగా ఉన్న 39 మంది జాడ కోసం భారత ప్రభుత్వం తీవ్రంగా వెతుకుతోంది. అయితే..
‘వారంతా వంద శాతం బతికి ఉన్నారా? లేదా? అనేది కచ్చితంగా చెప్పలేమని’ ఇరాక్‌ విదేశీ మంత్రి ఇబ్రహీం అల్‌ జఫారి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com