భారత్కు చైనా హెచ్చరిక
- July 28, 2017
భారత్-చైనా డోక్లామ్ సరిహద్దు వివాదం రగులుతూనే ఉంది. ఈ విషయంలో రాజీ దిశగా చైనా ఆలోచిస్తుందన్న ప్రచారం వట్టిదేనని ఆ దేశ అంతర్జాతీయ సంబంధాల పరిశోధకుడు హు జియాంగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.
డోక్లామ్ విషయంలో తమ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకునేది లేదని, తమ భూభాగం నుంచి తమ సైన్యాన్నే వెనక్కి ఎలా తీసుకుంటామని ప్రశ్నించింది. ఈ సందర్భంగా హు జియాంగ్ భారత్ తో చర్చల గురించి ప్రస్తావించారు. బ్రిక్స్ సమావేశంలో భాగంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లినంత మాత్రానా.. చైనా రాజీకి వస్తుందనుకోవడం సరికాదని అన్నారు.
ఈ అంశాన్ని ఉటంకిస్తూ చైనా రాజీ ధోరణి అంటూ భారత మీడియా ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికైనా ఊహాగానాలకు తెరదించాలని సూచించారు. 'చైనా నిర్ణయం మారదు.. భారత ప్రభుత్వం, అక్కడి మీడియా మేం రాజీపడుతున్నట్లుగా ఊహాగానాలు కల్పించడం సరికాదు' అని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!







