భారత్కు చైనా హెచ్చరిక
- July 28, 2017
భారత్-చైనా డోక్లామ్ సరిహద్దు వివాదం రగులుతూనే ఉంది. ఈ విషయంలో రాజీ దిశగా చైనా ఆలోచిస్తుందన్న ప్రచారం వట్టిదేనని ఆ దేశ అంతర్జాతీయ సంబంధాల పరిశోధకుడు హు జియాంగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.
డోక్లామ్ విషయంలో తమ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకునేది లేదని, తమ భూభాగం నుంచి తమ సైన్యాన్నే వెనక్కి ఎలా తీసుకుంటామని ప్రశ్నించింది. ఈ సందర్భంగా హు జియాంగ్ భారత్ తో చర్చల గురించి ప్రస్తావించారు. బ్రిక్స్ సమావేశంలో భాగంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లినంత మాత్రానా.. చైనా రాజీకి వస్తుందనుకోవడం సరికాదని అన్నారు.
ఈ అంశాన్ని ఉటంకిస్తూ చైనా రాజీ ధోరణి అంటూ భారత మీడియా ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికైనా ఊహాగానాలకు తెరదించాలని సూచించారు. 'చైనా నిర్ణయం మారదు.. భారత ప్రభుత్వం, అక్కడి మీడియా మేం రాజీపడుతున్నట్లుగా ఊహాగానాలు కల్పించడం సరికాదు' అని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









