రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ'

- July 30, 2017 , by Maagulf
రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ'

హైపర్ మూవీ తో డిజాస్టర్ అందుకున్న హీరో రామ్ , ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోని తనకు సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వం లో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఊటీ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఇకపోతే ఈ చిత్రానికి 'ఉన్నది ఒకటే జిందగీ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
 

అతి త్వరలోనే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. రామ్ పూర్తిగా స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నిర్మాత స్రవంతి రవి కిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదలచేసే అవకాశాలున్నాయి. దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. కిషోర్ - రామ్ కాంబినేషన్ లో గతం లో నేను శైలజ మూవీ ఎంతో హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబో లో సినిమా వస్తుండడం తో భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com