రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ'
- July 30, 2017
హైపర్ మూవీ తో డిజాస్టర్ అందుకున్న హీరో రామ్ , ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోని తనకు సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వం లో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఊటీ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఇకపోతే ఈ చిత్రానికి 'ఉన్నది ఒకటే జిందగీ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
అతి త్వరలోనే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. రామ్ పూర్తిగా స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నిర్మాత స్రవంతి రవి కిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదలచేసే అవకాశాలున్నాయి. దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. కిషోర్ - రామ్ కాంబినేషన్ లో గతం లో నేను శైలజ మూవీ ఎంతో హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబో లో సినిమా వస్తుండడం తో భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







