భారీగా అమ్ముడుపోయిన పవన్-త్రివిక్రమ్ మూవీ శాటిలైట్ రైట్స్
- July 30, 2017
జల్సా , అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో మరో మూవీ రాబోతున్న సంగతి తెల్సిందే..ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొనిన్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో సినిమా బిజినెస్ భారీ లెవల్లో జరుగుతున్నట్లు సమాచారం.
తాజాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రికార్డు అమౌంట్ కు డీల్ అయ్యినట్లు సమాచారం . ప్రముఖ ఛానల్ జెమినీ టివి తెలుగు వర్షన్ శాటిలైట్ హక్కులను భారీస్థాయిలో రూ 21 కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు శాటిలైట్ రైట్స్ విషయంలో ఇది నాన్ బాహుబలి రికార్డ్. బాహుబలి రెండు భాగాలను కలిపి మాటివి దాదాపు 30 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా పవన్, త్రివిక్రమ్ ల చిత్ర హిందీ శాటిలైట్ హక్కులు కూడా భారీ మొతానికి అమ్ముడయ్యాయి. హిందీ హక్కులు రూ 11 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. పవన్ కు జోడిగా సురేష్ కీర్తి , అను లు నటిస్తున్నారు. అనిరుద్దీన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







