వైమానిక దళ విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం 12 హైవేలు
- July 31, 2017
అత్యవసర సమయాల్లో రహదారులపై వైమానిక దళ విమానాలను దించేందుకు 12 జాతీయ రహదారులకు భారతీయ వాయుసేన అనుమతి ఇచ్చింది. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి విమానాలు త్వరగా చేరుకోవడానికి ఈ చర్యలు ఉపయోగపడుతాయని ఎయిర్ఫోర్స్ ప్రతినిధులు తెలిపారు.
విమానాలు దిగేందుకు వీలుగా మొత్తం 21 జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని తొలుత ప్రతిపాదించినప్పటికీ.. చివరికి 12 రహదారులకు మాత్రమే అనుమతి లభించింది. వీటిలో మూడు రహదారులు మావోయిస్టు ప్రభావిత, వరద ప్రభావిత ప్రాంతాలైన ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. విమానాలు దిగేందుకు వీలుగా రహదారులపై తారు మందాన్ని పెంచి వాటిని మరింత దృఢంగా తయారు చేయనున్నారు.
‘ప్రస్తుతం 12 జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం, మిగతావాటికి త్వరలోనే అనుమతి లభిస్తుంది. సాధారణ సమయాల్లో ఈ రహదారులపై ట్రాఫిక్ను అనుమతిస్తాం. అత్యవసర సమయాల్లో మాత్రం వాహన రాకపోకలను నలిపివేసి విమానాలు దిగేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఆ సమయంలో వాహన రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తాం.’ అని ఐఏఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
2016 నవంబర్లో వాయుసేనకు చెందిన జెట్ విమానాలు లఖ్నవూ-ఆగ్రా రహదారిపై దిగిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







