వైమానిక దళ విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం 12 హైవేలు
- July 31, 2017
అత్యవసర సమయాల్లో రహదారులపై వైమానిక దళ విమానాలను దించేందుకు 12 జాతీయ రహదారులకు భారతీయ వాయుసేన అనుమతి ఇచ్చింది. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి విమానాలు త్వరగా చేరుకోవడానికి ఈ చర్యలు ఉపయోగపడుతాయని ఎయిర్ఫోర్స్ ప్రతినిధులు తెలిపారు.
విమానాలు దిగేందుకు వీలుగా మొత్తం 21 జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని తొలుత ప్రతిపాదించినప్పటికీ.. చివరికి 12 రహదారులకు మాత్రమే అనుమతి లభించింది. వీటిలో మూడు రహదారులు మావోయిస్టు ప్రభావిత, వరద ప్రభావిత ప్రాంతాలైన ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. విమానాలు దిగేందుకు వీలుగా రహదారులపై తారు మందాన్ని పెంచి వాటిని మరింత దృఢంగా తయారు చేయనున్నారు.
‘ప్రస్తుతం 12 జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం, మిగతావాటికి త్వరలోనే అనుమతి లభిస్తుంది. సాధారణ సమయాల్లో ఈ రహదారులపై ట్రాఫిక్ను అనుమతిస్తాం. అత్యవసర సమయాల్లో మాత్రం వాహన రాకపోకలను నలిపివేసి విమానాలు దిగేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఆ సమయంలో వాహన రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తాం.’ అని ఐఏఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
2016 నవంబర్లో వాయుసేనకు చెందిన జెట్ విమానాలు లఖ్నవూ-ఆగ్రా రహదారిపై దిగిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









