చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చిన అంశాలివే...

- July 31, 2017 , by Maagulf
చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చిన అంశాలివే...

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుమారు గంటపాటు పవన్‌ కల్యాణ్‌ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉద్దానం, పోలవరం, రాజధాని, మంజునాధ్ కమిషన్ సహా..తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. పవన్‌తోపాటు హార్వర్డ్‌ వైద్యుల బృందం, మంత్రి కామినేని, వైద్యారోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను హార్వర్డ్‌ వైద్యులు ప్రభుత్వం ముందు ఉంచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com