భారత్ లో భారీగా పెరిగిన విమానాయగం
- July 31, 2017
భారత్లో విమానయానం రోజురోజుకూ పెరుగుతోందని ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ పేర్కొంది. దీంతో రానున్న 20 ఏళ్లలో 2,100 కొత్త విమానాలను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. దీని విలువ సుమారు 290 బిలియన్ డాలర్లుగా ఉండనుందని అంచనా వేసింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్లో విమానయానం అధిక వృద్ధి కనబరుస్తోందని ఆ కంపెనీ ఆసియా పసిఫిక్, ఇండియా సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేస్కర్ పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా భారత విమానయానంలో 20 శాతం మేర వృద్ధి కనబరుస్తోందని పేర్కొన్నారు. రానున్న 20 ఏళ్లలో దక్షిణాసియాలో ప్రయాణికుల్లో వృద్ధి రేటు సగటు 8 శాతంగా ఉండనుందని, ప్రపంచవ్యాప్త సగటు 4.7 శాతం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీన్ని భారత్ అధిగమిస్తుందని తెలిపారు. ఎక్స్ఛేంజ్ రేట్ స్థిరంగా ఉండడం, తక్కువ ఇంధన ధరలు, తక్కువ ధరకే విమాన ప్రయాణం వంటి కారణాలు భారత్లో విమాన ప్రయాణాలకు పెరుగుదలకు వూతమిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పథకం (ఉడాన్) ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూసి దానిబట్టి తమ అంచనాలను సవరిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్లో తీసుకురాబోయే 737, 737 మ్యాక్స్ వంటి 1780 విమానాలను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా రానున్న 20 ఏళ్లలో 41,030 విమానాలు కొనుగోలు జరిగే అవకాశం ఉందని, ఇందులో భారత్ వాటా 5 శాతంగా ఉండనుందని తెలిపారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









