భారత్ లో భారీగా పెరిగిన విమానాయగం
- July 31, 2017
భారత్లో విమానయానం రోజురోజుకూ పెరుగుతోందని ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ పేర్కొంది. దీంతో రానున్న 20 ఏళ్లలో 2,100 కొత్త విమానాలను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. దీని విలువ సుమారు 290 బిలియన్ డాలర్లుగా ఉండనుందని అంచనా వేసింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్లో విమానయానం అధిక వృద్ధి కనబరుస్తోందని ఆ కంపెనీ ఆసియా పసిఫిక్, ఇండియా సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేస్కర్ పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా భారత విమానయానంలో 20 శాతం మేర వృద్ధి కనబరుస్తోందని పేర్కొన్నారు. రానున్న 20 ఏళ్లలో దక్షిణాసియాలో ప్రయాణికుల్లో వృద్ధి రేటు సగటు 8 శాతంగా ఉండనుందని, ప్రపంచవ్యాప్త సగటు 4.7 శాతం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీన్ని భారత్ అధిగమిస్తుందని తెలిపారు. ఎక్స్ఛేంజ్ రేట్ స్థిరంగా ఉండడం, తక్కువ ఇంధన ధరలు, తక్కువ ధరకే విమాన ప్రయాణం వంటి కారణాలు భారత్లో విమాన ప్రయాణాలకు పెరుగుదలకు వూతమిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పథకం (ఉడాన్) ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూసి దానిబట్టి తమ అంచనాలను సవరిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్లో తీసుకురాబోయే 737, 737 మ్యాక్స్ వంటి 1780 విమానాలను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా రానున్న 20 ఏళ్లలో 41,030 విమానాలు కొనుగోలు జరిగే అవకాశం ఉందని, ఇందులో భారత్ వాటా 5 శాతంగా ఉండనుందని తెలిపారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









