భారత్ లో భారీగా పెరిగిన విమానాయగం
- July 31, 2017
భారత్లో విమానయానం రోజురోజుకూ పెరుగుతోందని ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ పేర్కొంది. దీంతో రానున్న 20 ఏళ్లలో 2,100 కొత్త విమానాలను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. దీని విలువ సుమారు 290 బిలియన్ డాలర్లుగా ఉండనుందని అంచనా వేసింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్లో విమానయానం అధిక వృద్ధి కనబరుస్తోందని ఆ కంపెనీ ఆసియా పసిఫిక్, ఇండియా సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేస్కర్ పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా భారత విమానయానంలో 20 శాతం మేర వృద్ధి కనబరుస్తోందని పేర్కొన్నారు. రానున్న 20 ఏళ్లలో దక్షిణాసియాలో ప్రయాణికుల్లో వృద్ధి రేటు సగటు 8 శాతంగా ఉండనుందని, ప్రపంచవ్యాప్త సగటు 4.7 శాతం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీన్ని భారత్ అధిగమిస్తుందని తెలిపారు. ఎక్స్ఛేంజ్ రేట్ స్థిరంగా ఉండడం, తక్కువ ఇంధన ధరలు, తక్కువ ధరకే విమాన ప్రయాణం వంటి కారణాలు భారత్లో విమాన ప్రయాణాలకు పెరుగుదలకు వూతమిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పథకం (ఉడాన్) ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూసి దానిబట్టి తమ అంచనాలను సవరిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్లో తీసుకురాబోయే 737, 737 మ్యాక్స్ వంటి 1780 విమానాలను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా రానున్న 20 ఏళ్లలో 41,030 విమానాలు కొనుగోలు జరిగే అవకాశం ఉందని, ఇందులో భారత్ వాటా 5 శాతంగా ఉండనుందని తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







