విడుదలైన 'జవాన్' టీజర్
- July 31, 2017
తిక్క , విన్నర్ ప్లాపుల తర్వాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం జవాన్. స్టార్ రైటర్ బీవీఎస్ రవి దర్శకత్వం లో మెహరీన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ కి సంబంధించిన ప్రీల్యూడ్ కొద్దీ సేపటి క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు..'కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు.. కృతజ్ఞత.' అంటూ సాయిధరమ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే తమన్ బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ బ్యానర్పై కృష్ణ నిర్మిస్తున్నారు. దిల్రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అతి త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్









