వేర్పాటువాదుల వ్యవహారంలో ఎన్ఐఏకు కీలక సమాచారం
- July 31, 2017జమ్ముకశ్మీర్ వేర్పాటువాదుల వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు కీలక ఆధారాలు లభించాయి. హురియత్ నేత సయ్యద్ అలీ షా గిలానీ విడుదల చేసిన అల్లర్లకు సంబంధించిన ఓ కాలెండర్ను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కశ్మీర్లో ఏ యే రోజు ఎక్కడ అల్లర్లు జరపాలన్న వివరాలు అందులో ఉన్నాయి. గతేడాది జూలై8న హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత జరగాల్సిన అల్లర్లపై అందులో వివరంగా ఉంది. హురియత్ నేతలు నిర్దేశించిన ఈ కార్యాచరణకు అనుగుణంగానే భద్రతా బలగాలపై అల్లరిమూకలు రాళ్లదాడులు జరిపినట్టు అధికారులు చెబుతున్నారు. కశ్మీర్ లోయలో అశాంతి, అల్లర్లకు వేర్పాటు వాదులు ఎలా ఆజ్యం పోస్తున్నారన్నది ఈ కాలెండర్తో స్పష్టమైంది. హురియత్ నేతలకు పాకిస్తాన్ ఏజెన్సీల నుంచి ఫండ్ వస్తున్న విషయం ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగు చూసింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ