వేర్పాటువాదుల వ్యవహారంలో ఎన్ఐఏకు కీలక సమాచారం

- July 31, 2017 , by Maagulf
వేర్పాటువాదుల వ్యవహారంలో ఎన్ఐఏకు కీలక సమాచారం

జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాదుల వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు కీలక ఆధారాలు లభించాయి. హురియత్‌ నేత సయ్యద్‌ అలీ షా గిలానీ విడుదల చేసిన అల్లర్లకు సంబంధించిన ఓ కాలెండర్‌ను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. కశ్మీర్‌లో ఏ యే రోజు ఎక్కడ అల్లర్లు జరపాలన్న వివరాలు అందులో ఉన్నాయి. గతేడాది జూలై8న హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత జరగాల్సిన అల్లర్లపై అందులో వివరంగా ఉంది. హురియత్ నేతలు నిర్దేశించిన ఈ కార్యాచరణకు అనుగుణంగానే భద్రతా బలగాలపై అల్లరిమూకలు రాళ్లదాడులు జరిపినట్టు అధికారులు చెబుతున్నారు. కశ్మీర్‌ లోయలో అశాంతి, అల్లర్లకు వేర్పాటు వాదులు ఎలా ఆజ్యం పోస్తున్నారన్నది ఈ కాలెండర్‌తో స్పష్టమైంది. హురియత్‌ నేతలకు పాకిస్తాన్‌ ఏజెన్సీల నుంచి ఫండ్‌ వస్తున్న విషయం ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగు చూసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com