నేడు పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని ఎన్నిక
- July 31, 2017
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని పదవి కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్(నవాజ్) తరఫున షహీద్ ఖాకన్ అబ్బాసీ నామపత్రం సమర్పించారు. ఉమ్మడి అభ్యర్థిని నిలపడంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అయిదుగురు నామపత్రాలు దాఖలు చేశారు. దిగువసభ నేషనల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 342 కాగా, విజయం సాధించడానికి 172 ఓట్లు రావాల్సి ఉంది. నవాజ్ పార్టీ, మిత్ర పక్షాలకు 209 సీట్లు ఉండడంతో అబ్బాసీ విజయం ఖాయంగా కనిపిస్తోంది.
పాక్ ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి పైనా అవినీతి కేసు: పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి షహీద్ ఖాకన్ అబ్బాసీ కూడా అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. రూ.22 వేల కోట్ల విలువైన ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్జీ) కాంట్రాక్టు మంజూరులో అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై 2015లో జాతీయ జవాబుదారీ సంస్థ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోందని డాన్ న్యూస్ పత్రిక వెల్లడించింది. మరోవైపు విదేశీ విరాళాల కేసులో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించారని నవాజ్ షరీఫ్ పార్టీ ఆరోపించింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







