ప్రపంచ మార్కెట్ల పసిడి ధర పెరిగింది
- October 21, 2015
ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఈ రోజు బంగారం ధర పెరిగింది. రూ.105 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.27,335కి చేరింది. అమెరికా వడ్డీ రేట్లు పెంపు విషయంపై వచ్చే వారం ఫెడరల్ రిజర్వ్ సమావేశమవుతుండటం, 2016 వరకు వడ్డీ రేట్లు పెరగకపోవచ్చన్న వదంతులు వ్యాపిస్తుండటం తదితర కారణాలు అంతర్జాతీయంగా బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. సింగపూర్ మార్కెట్లో సైతం ఔన్సు బంగారం ధర 0.3శాతం పెరిగి 1,179.35 అమెరికన్ డాలర్లకు చేరింది.రూ.37,000 దిగువకు వెండిఅమ్మకాల ఒత్తిడితో ఈ రోజు వెండి ధర రూ.175 తగ్గి రూ.36,900కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో ఈ లోహం ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







