ప్రపంచ మార్కెట్ల పసిడి ధర పెరిగింది

- October 21, 2015 , by Maagulf
ప్రపంచ మార్కెట్ల పసిడి ధర పెరిగింది

ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఈ రోజు బంగారం ధర పెరిగింది. రూ.105 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.27,335కి చేరింది. అమెరికా వడ్డీ రేట్లు పెంపు విషయంపై వచ్చే వారం ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశమవుతుండటం, 2016 వరకు వడ్డీ రేట్లు పెరగకపోవచ్చన్న వదంతులు వ్యాపిస్తుండటం తదితర కారణాలు అంతర్జాతీయంగా బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. సింగపూర్‌ మార్కెట్లో సైతం ఔన్సు బంగారం ధర 0.3శాతం పెరిగి 1,179.35 అమెరికన్‌ డాలర్లకు చేరింది.రూ.37,000 దిగువకు వెండిఅమ్మకాల ఒత్తిడితో ఈ రోజు వెండి ధర రూ.175 తగ్గి రూ.36,900కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో ఈ లోహం ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com