కోలీవడ్ లో నిలిచిన సినిమా షూటింగ్లు
- August 01, 2017తమిళనాడు వ్యాప్తంగా సినిమా షూటింగ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) చేపట్టిన ఆందోళనతో దాదాపు 20 సినిమాల చిత్రీకరణ నిలిచిపోయింది. షూటింగ్ నిలిచిపోయిన సినిమాల్లో తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ ‘కాలా’ కూడా ఉంది. ఎఫ్ఈఎఫ్ఎస్ఐ నిరసనలో 24 సంఘాలకు చెందిన దాదాపు 25వేల మంది సినీ సిబ్బంది పాల్గొంటున్నారు. అయితే, వీరి డిమాండ్లను తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్(టీఎఫ్పీసీ) తోసిపుచ్చింది.
ఎఫ్ఈఎఫ్ఎస్ఐ నేతలకు టీఎఫ్పీసీ మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు ముదిరిపోయాయి. ‘బిల్లా పాండి’ సినిమా షూటింగ్ సందర్భంగా వేతనాలు పెంచాలనే డిమాండ్పై ఆ చిత్ర నిర్మాత-నటుడు అయిన ఆర్కే సురేష్తో ఎఫ్ఈఎఫ్ఎస్ఐ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ముదిరి మంగళవారం సమ్మె దాకా వెళ్లింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న టీఎఫ్పీసీ ప్రెసిడెంట్ విశాల్.. ఎఫ్ఈఎఫ్ఎస్ఐ సభ్యులు కానివారితో షూటింగ్లు చేసుకోవాలని నిర్మాతలకు సలహాఇచ్చారు. అయితే, దీనిపై ఎఫ్ఈఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మండిపడ్డారు.
ఇదివరలో కుదుర్చుకున్న వేతన ఒప్పందం జూలై 31వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే మరో వేతన ఒప్పందం తీసుకురావాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. సినీ రంగ పనివారి డిమాండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోమని, ప్రత్యామ్నాయ మార్గాల్లో షూటింగ్లు కొనసాగించుకోవాలని టీఎఫ్పీసీ ప్రెసిడెంట్ విశాల్ సూచించారు. ఆయన నటిస్తున్న సినిమా ‘తుప్పరివాలన్’ షూటింగ్ మంగళవారం కొనసాగింది.
తాజా వార్తలు
- 3 గ్లోబల్ హెల్త్ అవార్డులను అందుకున్న ఒమన్
- పెంపుడు జంతువుతో ప్రయాణిస్తున్నారా? అనుమతి, ప్రక్రియ, వ్యాక్సిన్ల వివరాలు
- అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సిక్కింలో ఎస్కేఎం విజయ దుందుభి..
- ఖతార్ లో 1.2 మిలియన్ చదరపు మీటర్ల గ్రీనరీ పునరుద్ధరణ
- కువైట్ కొత్త క్రౌన్ ప్రిన్స్గా షేక్ సబా అల్-ఖాలీద్ అల్-సబా
- సోషల్ మీడియాలో మోసపూరిత ప్రచారం..ఇద్దరు అరెస్ట్
- దుబాయ్ లో సింగిల్ యూజ్ బ్యాగ్లపై నిషేధం ప్రారంభం
- నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు
- నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం