ప్యాలెస్ లో హడావిడి చేస్తున్న మహేశ్బాబు
- August 06, 2017అగ్ర కథానాయకుడు మహేశ్బాబు నటిస్తున్న చిత్రం 'భరత్ అను నేను'. కొరటాల శివ దర్శకుడు. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రి గా కనిపించనున్నారు. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ వచ్చే వారం లఖ్నవూలో జరగనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ఆగస్టు 10న ప్రారంభమై, 22 వరకు జరగనుందట. జహంగీరాబాద్ ప్యాలెస్, నడ్వా కళాశాల, ముసాబాఘ్ ప్యాలెస్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ షెడ్యూల్లో మహేశ్తో సహా కీలక పాత్రధారులు కూడా పాల్గొంటున్నారట.
కైరా అడ్వాణీ ఇందులో మహేశ్ సరసన నటిస్తున్నారు. తమిళ నటుడు శరత్కుమార్ ఈ చిత్రంలో మహేశ్ తండ్రిగా నటిస్తున్నారు. 'శ్రీమంతుడు' తర్వాత మహేశ్-కొరటాల కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!