ప్యాలెస్‌ లో హడావిడి చేస్తున్న మహేశ్‌బాబు

- August 06, 2017 , by Maagulf
ప్యాలెస్‌ లో హడావిడి చేస్తున్న మహేశ్‌బాబు

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం 'భరత్‌ అను నేను'. కొరటాల శివ దర్శకుడు. ఇందులో మహేశ్‌ ముఖ్యమంత్రి గా కనిపించనున్నారు. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్‌ వచ్చే వారం లఖ్‌నవూలో జరగనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌ ఆగస్టు 10న ప్రారంభమై, 22 వరకు జరగనుందట. జహంగీరాబాద్‌ ప్యాలెస్‌, నడ్వా కళాశాల, ముసాబాఘ్‌ ప్యాలెస్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌తో సహా కీలక పాత్రధారులు కూడా పాల్గొంటున్నారట.
కైరా అడ్వాణీ ఇందులో మహేశ్‌ సరసన నటిస్తున్నారు. తమిళ నటుడు శరత్‌కుమార్‌ ఈ చిత్రంలో మహేశ్‌ తండ్రిగా నటిస్తున్నారు. 'శ్రీమంతుడు' తర్వాత మహేశ్‌-కొరటాల కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com