ప్యాలెస్ లో హడావిడి చేస్తున్న మహేశ్బాబు
- August 06, 2017
అగ్ర కథానాయకుడు మహేశ్బాబు నటిస్తున్న చిత్రం 'భరత్ అను నేను'. కొరటాల శివ దర్శకుడు. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రి గా కనిపించనున్నారు. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ వచ్చే వారం లఖ్నవూలో జరగనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ఆగస్టు 10న ప్రారంభమై, 22 వరకు జరగనుందట. జహంగీరాబాద్ ప్యాలెస్, నడ్వా కళాశాల, ముసాబాఘ్ ప్యాలెస్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ షెడ్యూల్లో మహేశ్తో సహా కీలక పాత్రధారులు కూడా పాల్గొంటున్నారట.
కైరా అడ్వాణీ ఇందులో మహేశ్ సరసన నటిస్తున్నారు. తమిళ నటుడు శరత్కుమార్ ఈ చిత్రంలో మహేశ్ తండ్రిగా నటిస్తున్నారు. 'శ్రీమంతుడు' తర్వాత మహేశ్-కొరటాల కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







