ఖతార్ సంక్షోభంపై కువైట్ కొత్త ప్రతిపాదన
- August 08, 2017
ఖతార్ సంక్షోభం నేపథ్యంలో కువైట్ కొత్త ప్రతిపాదనలో ముందుకొచ్చింది. చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్న కువైట్, ఖతార్పై బ్యాన్ విధించిన వివిధ దేశాలతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఖతార్ సంక్షోభం ఎక్కువ కాలం ఉండటం గల్ఫ్ ప్రాంతానికి మంచిది కాదని కువైట్ భావిస్తోంది. కువైట్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఫారిన్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ హమాద్ అల్ సబా మరియు స్టేట్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అలాగే యాక్టింగ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ అల్ అబ్దుల్లా సోమవారం సౌదీ అరేబియా, ఈజిప్ట్లకు చెందిన ప్రముఖులతో చర్చించరు. సౌదీ అరేబియాలో జరిగిన చర్చల్లో గల్ఫ్ ప్రాంతంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇంకో వైపున జూన్ నుంచి ఖతార్ సంక్షోభ నివారణకు జరుగుతున్న ప్రయత్నాలేవీ సత్ఫలితాలు ఇవ్వడంలేదు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్









