టెర్రరిస్టులుతో సంబంధాలు వున్నాయని సౌదీ ఆరోపణలను ఖండించిన ఇరాన్
- August 10, 2017
తాలిబాన్ తీవ్రవాదులతో, ఆఫ్ఘనిస్తాన్లోని సాయుధ గ్రూపులతో ఇరాన్కు సంబంధాలు వున్నాయని సౌదీ దౌత్యవేత్త చేసిన ఆరోపణలను కాబూల్ లోని ఇరాన్ ఎంబసీ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. సౌదీ దౌత్యవేత్త మిషారి అల్ హర్బి చేసిన విచ్ఛిన్నకర మైన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి ప్రాతిపదిక లేదని, వాటిని తాము నిర్ద్వంద్వంగా ఖండిస్తు న్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదానికి, హింసాకాండకు తమ దౌత్యవేత్తలే బాధితులుగా మారుతున్నారని ఆ ప్రకటన తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి, సుస్థిరతలకు మద్దతివ్వడమే తమ ప్రధాన విధానమని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసిందని పేర్కొంది.
తాజా వార్తలు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!









