టెర్రరిస్టులుతో సంబంధాలు వున్నాయని సౌదీ ఆరోపణలను ఖండించిన ఇరాన్
- August 10, 2017
తాలిబాన్ తీవ్రవాదులతో, ఆఫ్ఘనిస్తాన్లోని సాయుధ గ్రూపులతో ఇరాన్కు సంబంధాలు వున్నాయని సౌదీ దౌత్యవేత్త చేసిన ఆరోపణలను కాబూల్ లోని ఇరాన్ ఎంబసీ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. సౌదీ దౌత్యవేత్త మిషారి అల్ హర్బి చేసిన విచ్ఛిన్నకర మైన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి ప్రాతిపదిక లేదని, వాటిని తాము నిర్ద్వంద్వంగా ఖండిస్తు న్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదానికి, హింసాకాండకు తమ దౌత్యవేత్తలే బాధితులుగా మారుతున్నారని ఆ ప్రకటన తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి, సుస్థిరతలకు మద్దతివ్వడమే తమ ప్రధాన విధానమని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసిందని పేర్కొంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









