అత్యాధునిక నగరంగా హైదరాబాద్ రూపు దిద్దుకోనుంది - కేటీఆర్

- August 11, 2017 , by Maagulf
అత్యాధునిక నగరంగా హైదరాబాద్ రూపు దిద్దుకోనుంది - కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం వస్తే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని భయపెట్టారని.. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉందని  తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మూడో వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లలోనే  ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందినదని అన్నారు. కరెంటు కోతలు లేకుండా చేయడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని.. అలాగే తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో అధిగమిస్తున్నామని కేటీఆర్ ఆన్నారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన రాష్ట్రాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని.. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని కేటీఆర్ అన్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com