అత్యాధునిక నగరంగా హైదరాబాద్ రూపు దిద్దుకోనుంది - కేటీఆర్
- August 11, 2017
తెలంగాణ రాష్ట్రం వస్తే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని భయపెట్టారని.. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉందని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మూడో వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందినదని అన్నారు. కరెంటు కోతలు లేకుండా చేయడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని.. అలాగే తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో అధిగమిస్తున్నామని కేటీఆర్ ఆన్నారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన రాష్ట్రాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని.. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







