అత్యాధునిక నగరంగా హైదరాబాద్ రూపు దిద్దుకోనుంది - కేటీఆర్
- August 11, 2017
తెలంగాణ రాష్ట్రం వస్తే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని భయపెట్టారని.. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉందని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మూడో వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందినదని అన్నారు. కరెంటు కోతలు లేకుండా చేయడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని.. అలాగే తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో అధిగమిస్తున్నామని కేటీఆర్ ఆన్నారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన రాష్ట్రాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని.. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







