డబ్బు అపహరించిన కేసులో ఆసియా కార్మికుడు జైలుశిక్ష ...దేశ బహిష్కరణ
- August 12, 2017
2,000 బేహారిన్ దినార్లను దొంగతనం చేసిన కేసులో 32 ఏళ్ల ఆసియా దేశస్థుడికి మూడు నెలల జైలుశిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరణ శిక్షను సెంట్రల్ హయ్యర్ క్రిమినల్ కోర్ట్ (అప్పీల్స్ కోర్టు) విధించింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఒక క్లయింట్ నుండి 2,000 బేహారిన్ దినార్లను తీసుకొన్న తర్వాత రుసటి రోజున రసీదుని అందజేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక ఆ నిందితుడు తానూ పనిచేస్తున్న తన యజమానిని వద్దకు వెళ్లి తనకు అత్యవసరంగా సెలవులు కావాలని అందుకు అనుమతించమని కోరారు, తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా తానూ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందని నమ్మబలికెడు. ఆ యజమాని ప్రతివాది మాటలకు కరిగిపోయి 500 బేహారిన్ దినార్లనుతన విమాన టికెట్ మరియు రెసిడెన్సీ రద్దు ఫీజుల ఖర్చుతో యజమాని నిందితునికి అత్యవసర సెలవును మంజూరు చేయడానికి అంగీకరించాడు.తన డబ్బుకి ఎటువంటి రసీదు ఇవ్వకుండా దేశం నుంచి నిందితుడు పారిపోవడానికి ఆ ఉద్యోగి యత్నిస్తున్నట్లు కస్టమర్ పోలీసులకు పిర్యాదు చేసాడు. నిందితుడిని అరెస్టు చేసినపుడు, తనపై వచ్చిన ఆరోపణలను ప్రతివాది ఖండించాడు ఏది ఏమయినప్పటికీ, ముద్దాయిని మూడు నెలల పాటు ఖైదు చేసి, దేశం నుండి బహిష్కరించి తిరిగి రాజ్యములో ప్రవేశించకుండా శాశ్వతంగా నిషేధించాలని తుది తీర్పు కోర్టు ఇచ్చింది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







