ఈజిప్టులో రైలు ప్రమాదం 44 మంది మృతి

- August 12, 2017 , by Maagulf
ఈజిప్టులో రైలు ప్రమాదం 44 మంది మృతి

ఈజిప్టు రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరుకుంది. అలెగ్జాండ్రియాలో రెండు రైళ్లు ఢకొీన్న ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. మరో 180 మంది గాయపడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటన శుక్రవారం జరిగింది. స్థానిక కెనాల్‌ సిటీ నుంచి బయల్దేరిన ఓ రైలు ఖోర్షిద్‌ ప్రాంతంలోని చిన్న రైల్వేస్టేషన్‌ వద్ద ఆగింది. ఇంతలో కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న మరో రైలు.. ఆగి ఉన్న రైలును వెనుక నుంచి ఢకొీట్టింది. రైలు వేగంగా ఢకొీట్టడంతో బోగీలు నుజునుజ్జు అయ్యాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com