ఈజిప్టులో రైలు ప్రమాదం 44 మంది మృతి
- August 12, 2017
ఈజిప్టు రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరుకుంది. అలెగ్జాండ్రియాలో రెండు రైళ్లు ఢకొీన్న ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. మరో 180 మంది గాయపడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటన శుక్రవారం జరిగింది. స్థానిక కెనాల్ సిటీ నుంచి బయల్దేరిన ఓ రైలు ఖోర్షిద్ ప్రాంతంలోని చిన్న రైల్వేస్టేషన్ వద్ద ఆగింది. ఇంతలో కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న మరో రైలు.. ఆగి ఉన్న రైలును వెనుక నుంచి ఢకొీట్టింది. రైలు వేగంగా ఢకొీట్టడంతో బోగీలు నుజునుజ్జు అయ్యాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







