భారీ ఎన్‌కౌంటర్‌ లో హతమైన టాప్‌ హిజ్బుల్‌ కమాండర్‌

- August 13, 2017 , by Maagulf
భారీ ఎన్‌కౌంటర్‌ లో హతమైన టాప్‌ హిజ్బుల్‌ కమాండర్‌

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా షోపియన్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ టాప్‌ కమాండర్‌ యాసిన్‌ యాతూ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు-ఆర్మీ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భారత సైనికులు కూడా అమరులు అయ్యారు. షోషియన్‌ జిల్లాలోని అన్వీరా గ్రామంలో శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదుల ఏరివేతతో ఆదివారం ఉదయం తెల్లవారుజామున ముగిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com