తెలంగాణ నుంచి మక్కాకు తొలి బృందం

- August 14, 2017 , by Maagulf
తెలంగాణ నుంచి మక్కాకు తొలి బృందం

452 మంది యాత్రికులతో బయలుదేరిన విమానం 
 ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాను దర్శించుకోవడానికి సోమవారం తెల్లవారుజామున తొలి విమానంలో దాదాపు 452 మంది హజ్‌ యాత్రికులు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది తొలిసారిగా హజ్‌యాత్రికులతో వెళుతున్న సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌ విమానంను శంషాబాద్‌ విమానాశ్రయం హజ్‌ టర్మినల్‌ వద్ద ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ జెండా వూపి యాత్రను ప్రారంభించారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సయ్యద్‌ అక్బర్‌ హుస్సేన్‌, గ్రేటర్‌ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ..పేద ముస్లిం కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com