డ్రగ్స్ ఇష్యూపై పాట పాడి అందరిని కదిలించిన రఘు
- August 15, 2017
కళ్ల ముందే కన్న బిడ్డలు రాలిపోతుంటే... డ్రగ్స్ మహమ్మారి మత్తులో పసివాళ్లు తమ జీవితాలను కోల్పోతుంటే... గుండె బరువెక్కి చేసిన చిన్న ప్రయత్నం ఇది... యువతను రక్షిద్దాం, వారి భవిష్యత్తును కాపాడుదాం.... అంటూ తాజాగా విడుదలైన ఓ వీడియో సాంగ్ ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.
ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. స్కూలు పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదిలింది. పలువురు సినీ స్టార్ల పేర్లు సైతం ఈ వ్యవహారంలో ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డ్రగ్స్ మహమ్మారిన నుండి యువతను కాపాడుదాం, సేవ్ యంగ్ ఇండియా అంటూ... మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ మ్యూజిక్ ఆల్బమ్ తయారు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దీన్ని రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









