హజ్ యాత్రలో విషాదం సొమవారం 31 మంది మృతి

- August 16, 2017 , by Maagulf
హజ్ యాత్రలో విషాదం  సొమవారం  31 మంది మృతి

 సోమవారం సౌదీ అరేబియాలో 31 మంది అనూహ్య పరిస్థితులలో చనిపోయారని అక్కడ పత్రికలు వెల్లడిస్తున్నాయి   హజ్ యాత్రలో జరిగిన ఈ విషాదం స్థానికంగా కలకలం కల్గిస్తుంది. . మక్కా, మదీనాల్లోని ముస్లిం పవిత్ర ప్రార్థనాలయాలను సందర్శించేందుకు హజ్ యాత్రకు వెళ్లిన లక్షలాది విదేశీయుల్లో సొమవారం ఒక్కరోజే 31 మంది చనిపోయినట్లు సౌదీ అధికారిక పత్రిక వెల్లడించింది. 6 లక్షల 20వేల మంది విదేశీయులు హజ్ యాత్ర కోసం సౌదీకి వచ్చారనీ, వీరిలో సోమవారం మక్కాలో 31 మంది మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. 2015 తర్వాత జరిగిన దుర్ఘటనలలో  ది అత్యంత పెద్దదని సౌదీ ప్రజలు చెప్పుకుంటున్నారు. వారంతా ఎందుకు మరణించారనే విషయాన్ని సౌదీ ప్రభుత్వం ప్రకటించలేదు. వారి వివరాలను ఆయా దేశాల ప్రభుత్వాలకు తెలియజేస్తామని వివరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com