అక్రమ నివాసి అనే ముద్రతో స్వదేశానికి సజీవంగా రాలేక... చివరికి శవమై సొంత ఊరికి

- August 17, 2017 , by Maagulf
అక్రమ నివాసి అనే ముద్రతో  స్వదేశానికి సజీవంగా రాలేక... చివరికి శవమై సొంత ఊరికి

మస్కట్‌ : బతుకు తెరువు కోసం  14 ఏళ్ల క్రితం మస్కట్‌ కు వెళ్లాడు.. అక్కడ బాగా సంపాదించి సొంత ఊరికి వస్తాడనుకుంటే శవమై తిరిగి వచ్చాడు. తెలంగాణా రాష్ట్రంలోని  కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ కు చెందిన పాలమాకుల సత్తయ్య రజక వృత్తి చేసుకునేవాడు. అయితే ఉన్న ఊళ్లో ఉపాధి కరువైంది. దీంతో భార్య, పిల్లలను వదిలి 14 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఒమన్‌ లోని మస్కట్‌ వెళ్లాడు. ఈ క్రమంలో 2008 లో సత్తయ్య పాస్‌పోర్టు గడువు ముగియడంతో అక్కడ నిబంధనల ప్రకారం​ సత్తయ్య అక్రమ నివాసిగా మారాడు. క్షమాభిక్ష అవకాశమున్నా సత్తయ్య తిరిగి స్వగ్రామానికి రాలేకపోయాడు. సత్తయ్య కోసం గత 14 ఏళ్లుగా భార్య కనకమ్మ, కూతుళ్లు స్వప్న, శైలజ, కుమారుడు రమేష్ ఎదురుచూస్తునే ఉన్నారు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయిన సత్తయ్య అనారోగ్యంతో గత నెల జులై 31 న మృతి చెందాడు. పాస్‌ పోర్టు గడువు ముగిసి పోవడంతో అతని మృతదేహాన్ని ఇండియా పంపడానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో మస్కట్‌ లోని ఓ సామాజిక వేత్త ఇండియన్‌ ఎంబసీ సహాయంతో కుటుంబసభ్యులకు మృతదేహాన్ని పంపేందుకు కృషి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com