సౌదీ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కతర్
- August 17, 2017
గత కొన్ని రోజులుగా ఖతర్తో సంబంధాలు తెగదెంపులు చేసుకున్న సౌదీ అరేబియా కాస్తంత మెత్తబడింది. ఖతర్ నుంచి హజ్ యాత్రికులు వచ్చేందుకు వీలుగా రెండు దేశాల సరిహద్దు పోస్టులను తెరచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక తమ ఎయిర్లైన్స్ విమానాలను దోహాకు పంపి హజ్ యాత్రికులను మక్కాకు దగ్గర్లోని జెడ్డా వరకు రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రకటనను ఖతర్ స్వాగతించింది. ఈ నిర్ణయాన్ని శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా అమలయ్యేలా చూడాలని సౌదీ అరేబియాను కోరింది. సౌదీ యువరాజు సల్మాన్, ఖతర్కు చెందిన రాజ కుటుంబ సభ్యునితో బుధవారం సమావేశమైన అనంతర ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే సదరు రాజకుటుంబం 1972లో జరిగిన కుట్రలో పదవులు కోల్పోయిందని సమాచారం. సరిహద్దు- పోస్టులు తెరుచుకోవటంతో ఇప్పటికే 100 మంది ఖతర్ వాసులు సౌదీ అరేబియాలోకి ప్రవేశించారని అధికారులు తెలపారు.
దాదాపు గత 10 వారాలుగా సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టు కలిసి ఖతర్తో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నాయి. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఖతర్పై ఆరోపణలు చేస్తూ వివిధ అంశాలకు సంబంధించి 13 డిమాండ్లను నెరవేర్చాలని తమ దేశాల సరిహద్దులు మూసివేశాయి. విమాన సర్వీసులను కూడా రద్దు చేశాయి. దీంతో ఖతర్ ఒంటరిగా పోరాడుతోంది. వచ్చే వారంలో సౌదీ అరేబియాలో హజ్ యాత్ర మొదలుకానుంది. ఇందులో భాగంగా కోట్లాది మంది ముస్లింలు పవిత్ర మక్కా, మదీనాలను సందర్శించుకుంటారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







