నేడు సెగయలో వంటల పోటీ కార్యక్రమం
- August 19, 2017
మనామ: రానున్న ఓనం ఉత్సవాల్లో భాగంగా 4 పిఎమ్ న్యూస్ బహ్రెయిన్ కేరళీయ సమాజం (బి.కె.కె.) మహిళల విభాగంతో కలిసి సెగయలో బికెఎస్ ఆడిటోరియంలో 'ఐ-కుక్ లైవ్' కుకరీ పోటీ నిర్వహిస్తారు. ఇరవై మంది పోటీదారులతో ఈ పోటీలు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతాయి. పాల్గొనే వారు శాఖాహార వంటకంతో పాటు మరొక ఒక తీపి వంటకం సిద్ధం చేయాలి. వారి వంటకు కావాల్సిన వివిధ పదార్థాలను నిర్వాహకులు అందచేస్తారు. బహ్రెయిన్ లోని ప్రతిష్టాత్మక హోటళ్ళకు చెందిన పాకశాస్ర్త ప్రవీణులు ఈ వంటల పోటీలకు న్యాయమూర్తులుగా ఉంటారు. విజేతలకు మరియు పాల్గొనే ప్రతి మహిళకు ఆకర్షణీయమైన బహుమతులను అందచేస్తారు.ఇతర వినోద కార్యక్రమములతో పాటు మరియు ప్రేక్షకులకు బహుమతులు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానంగా క్లిక్ ఆన్ , అల్ ఒస్రా గ్రూప్, వి ఏం బి ట్రేడర్స్, ముహమ్మద్ ఫాఖ్రో మరియు బ్రదర్స్ డబ్ల్యూ ఎల్ ఎల్, సరస్, సన్ఫోర్డ్, హాట్ ప్యాక్ మరియు గ్రీన్ వే ట్రేడింగ్ తదితర సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. రిజిస్ట్రేషన్ మరియు మరిన్నిఇతర వివరాల కొరకు కో ఆర్డినేటర్ మోహిని థామస్ (39804019) లేదా షిజిత్ (38444687) సంప్రదించండి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







