నేడు సెగయలో వంటల పోటీ కార్యక్రమం

- August 19, 2017 , by Maagulf
నేడు  సెగయలో వంటల పోటీ కార్యక్రమం

మనామ: రానున్న ఓనం ఉత్సవాల్లో భాగంగా 4 పిఎమ్ న్యూస్ బహ్రెయిన్ కేరళీయ సమాజం (బి.కె.కె.)  మహిళల విభాగంతో కలిసి సెగయలో బికెఎస్ ఆడిటోరియంలో 'ఐ-కుక్ లైవ్' కుకరీ పోటీ నిర్వహిస్తారు. ఇరవై మంది పోటీదారులతో ఈ  పోటీలు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతాయి. పాల్గొనే వారు  శాఖాహార వంటకంతో పాటు మరొక ఒక తీపి వంటకం సిద్ధం చేయాలి. వారి వంటకు కావాల్సిన వివిధ పదార్థాలను  నిర్వాహకులు అందచేస్తారు. బహ్రెయిన్ లోని  ప్రతిష్టాత్మక హోటళ్ళకు చెందిన పాకశాస్ర్త ప్రవీణులు ఈ వంటల   పోటీలకు న్యాయమూర్తులుగా ఉంటారు. విజేతలకు మరియు పాల్గొనే ప్రతి మహిళకు  ఆకర్షణీయమైన బహుమతులను అందచేస్తారు.ఇతర వినోద కార్యక్రమములతో పాటు  మరియు  ప్రేక్షకులకు బహుమతులు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానంగా క్లిక్ ఆన్ , అల్ ఒస్రా గ్రూప్, వి ఏం బి  ట్రేడర్స్, ముహమ్మద్ ఫాఖ్రో మరియు బ్రదర్స్ డబ్ల్యూ ఎల్ ఎల్, సరస్, సన్ఫోర్డ్, హాట్ ప్యాక్ మరియు గ్రీన్ వే ట్రేడింగ్ తదితర సంస్థలు  స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. రిజిస్ట్రేషన్ మరియు మరిన్నిఇతర వివరాల కొరకు కో ఆర్డినేటర్  మోహిని థామస్ (39804019) లేదా షిజిత్ (38444687) సంప్రదించండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com