దేశవ్యాప్తంగా నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
- August 21, 2017
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక బ్యాంకింగ్ సంస్కరణలకు నిరసనగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.అజయ్కుమార్ తెలిపారు. సోమవారం విజయవాడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం, కార్పొరేట్ రుణమాఫీ చేయడమే కాకుండా ఇటీవల ఫైనాన్షియల్ రిజల్యూషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు- 2017ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే డిపాజిట్దారులకు రక్షణగా ఉన్న డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ రద్దవుతుందని తెలిపారు. కార్పొరేట్ సంస్థల మొండిబకాయిలతో బ్యాంకుల మనుగడకు ప్రమాదం పొంచి ఉందని, ప్రభుత్వం డిఫాల్టర్ల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం చేపట్టవద్దని, జీఎస్టీపేరిట సేవల రుసుం పెంపు ఉపసంహరించాలని కోరారు. బ్యాంకు పాలకమండళ్లలో డైరెక్టర్ల ఖాళీల భర్తీ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కారుణ్య నియామకాలు చేపట్టడం తదితర 17 డిమాండ్ల పరిష్కారానికి సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









