జైల్లో కారిడార్ను సొంత ఇంటిలావాడుకుంటున్న శశికళ
- August 21, 2017
పరప్పణ అగ్రహార జైలులో శిక్షననుభవిస్తున్న ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ జైలులో సుమారు 120 నుంచి 150 అడుగల పొడవున్న కారిడార్ను ఇరువైపులా బారికేడ్లు పెట్టి ప్రైవేటు స్థలంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ మాజీ డిఐజి డి రూప ఎసిబికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఈ కారిడార్లో ఉన్న ఐదు గదులు శశికళ ఉపయోగించుకుంటున్నారని, ఆమె వ్యక్తిగత సామగ్రి వాటిలో ఉందని రూప పేర్కొన్నారు. దుస్తులు, బెడ్డింగ్, వంటపాత్రలు, వాటర్ ఫిల్టర్, ఎలెక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్, ఒక టేబుల్ ఈ గదుల్లో ఉన్నాయని ఎసిబి ఐజిపికి ఇచ్చిన లేఖలో రూప పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు లేకుండా అనధికారికంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కోర్టు ధిక్కారమవుతుందని, అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లవుతుందని రూప పేర్కొన్నారు. జైలుకు వచ్చిన సందర్శకులను కలవడానికి శశికళ ప్రత్యేకంగా సదుపాయాలు కలిగిన మీటింగ్ రూమ్ను ఉపయోగించుకుంటున్నారని, దీనిలో చుట్టూ పరదాలు ఉండి లోపల ఏం జరుగుతున్నదో తెలిసే అవకాశం లేదని రూప తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను 6, 7 నెంబర్ల సిసిటివి కెమేరాలలో చూడవచ్చునని రూప అన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







