దక్షిణాఫ్రికా లోని మనుషుల్ని తిని అలసిపోయిన నరమాంస భక్షకుడు
- August 23, 2017మనిషి ని మనిషి చంపుకొని తినే స్థాయి నుంచి మానవుడు నాగరికత నేర్చాడు.. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల నర మాంస భక్షకులు ఉన్నారనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి.. తాజాగా ఓ నరమాంస భక్షకుడు తాను మనుషుల్ని తిని తిని అలసిపోయాను.. ఇక మనుషులను తినలేను అని పోలీస్ స్టేషన్ లో లొంగి పోయాడు. తాను లొంగిపోతూ.. పోలీసులకు ఓ మనిషి కాలు, చేతిని కూడా అప్పగించి వారికి షాక్ ఇచ్చాడు.. వివరాల్లోకి వెళ్తే..
దక్షిణాఫ్రికా లోని అమాంగ్వే ప్రాంతంలో గత కొంత కాలంగా పలువురు కనిపించకుండా పోతున్నారు. దీంతో చాలా మంది తమ వాళ్ళు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపద్యంలో పోలీసులు విచారణ చేపట్టగా ఓ ప్లేస్ లో కుండ దానినిండా మానవ అవయవాలు లభ్యమయ్యాయి. అంతేకాదు.. ఇటీవల ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు కలిసి దారుణంగా చంపేసి.. ఆమె మృత దేహాన్ని ముక్కలుగా నరికేశారు. ఆపై.. ఆమె మృతదేహంలోని అవయవాలను ఆ ముగ్గురు వ్యక్తులు తినేశారు.. ఈ విషయం పోలీసుల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.. కాగా ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు తాను మనుషులను తిని అలసిపోయాను అని స్వయంగా పోలీసులకు లొంగిపోవడం తో అతనిని అదుపులోకి తీసుకొన్నారు.. మిగిన ఇద్దరు నర మాంస భక్షకుల కోసం వెదుకుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
- పతంజలికి మరో షాక్.. 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్
- హైదరాబాద్లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!