సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా సెప్టెంబర్ రెండో వారంలో ప్రాజెక్ట్ Z విడుదల
- August 25, 2017
ఎస్.కె. అబ్దుల్లా సమర్పణలో ఎస్.బి.కె ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మిస్తోన్న చిత్రం ప్రాజెక్ట్ Z. ఈ చిత్రంలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సి.వి.కుమార్. నిర్మాతలు ఎస్.కె. బషీద్, ఎస్.కె. కరిమున్నీసా. ఈ చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె. బషీద్ చిత్ర విశేషాలను మీడియాకి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. మా ఈ ప్రాజెక్ట్ జెడ్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ని సెన్సార్ సభ్యులు ఇచ్చారు. చిత్రం చాలా బాగా వచ్చింది. సందీప్కిషన్ ఈ చిత్రంలో డిఫరెంట్ రోల్లో నటించాడు. అతడి కెరీర్లో ఈ చిత్రం పెద్ద హిట్ చిత్రంగా నిలబడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ చిత్రం కాన్సెఫ్ట్ అంత కొత్తగా ఉంటుంది. జిబ్రాన్ చాలా మంచి మ్యూజిక్ని ఇచ్చాడు. ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యే మూవీ మాత్రం కాదని పక్కాగా చెబుతున్నా. రాబోయే పది సంవత్సరాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేదే ఈ చిత్ర కథ. సెన్సార్ వాళ్ళు కూడా ఈ చిత్రం చాలా బాగుందని టీమ్ని మెచ్చుకున్నారు. త్వరలో ఆడియో ఫంక్షన్ని నిర్వహించి, సెప్టెంబర్ రెండోవారంలో చిత్రాన్ని ప్రేక్షుల ముందుకు తీసుకువస్తాము. ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలు మా బ్యానర్లో రెడీ అవుతున్నాయి. మా ఈ ప్రాజెక్ట్ Z విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను..అని అన్నారు.
తాజా వార్తలు
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!









