సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా సెప్టెంబర్ రెండో వారంలో ప్రాజెక్ట్ Z విడుదల
- August 25, 2017
ఎస్.కె. అబ్దుల్లా సమర్పణలో ఎస్.బి.కె ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మిస్తోన్న చిత్రం ప్రాజెక్ట్ Z. ఈ చిత్రంలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సి.వి.కుమార్. నిర్మాతలు ఎస్.కె. బషీద్, ఎస్.కె. కరిమున్నీసా. ఈ చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె. బషీద్ చిత్ర విశేషాలను మీడియాకి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. మా ఈ ప్రాజెక్ట్ జెడ్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ని సెన్సార్ సభ్యులు ఇచ్చారు. చిత్రం చాలా బాగా వచ్చింది. సందీప్కిషన్ ఈ చిత్రంలో డిఫరెంట్ రోల్లో నటించాడు. అతడి కెరీర్లో ఈ చిత్రం పెద్ద హిట్ చిత్రంగా నిలబడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ చిత్రం కాన్సెఫ్ట్ అంత కొత్తగా ఉంటుంది. జిబ్రాన్ చాలా మంచి మ్యూజిక్ని ఇచ్చాడు. ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యే మూవీ మాత్రం కాదని పక్కాగా చెబుతున్నా. రాబోయే పది సంవత్సరాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేదే ఈ చిత్ర కథ. సెన్సార్ వాళ్ళు కూడా ఈ చిత్రం చాలా బాగుందని టీమ్ని మెచ్చుకున్నారు. త్వరలో ఆడియో ఫంక్షన్ని నిర్వహించి, సెప్టెంబర్ రెండోవారంలో చిత్రాన్ని ప్రేక్షుల ముందుకు తీసుకువస్తాము. ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలు మా బ్యానర్లో రెడీ అవుతున్నాయి. మా ఈ ప్రాజెక్ట్ Z విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను..అని అన్నారు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









